విజయనగరం: ముఖ్యమంత్రి జగన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నగరానికి సమీపంలో గల గుంకలాం చేరుకొని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా….మంత్రి బొత్స, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మునుపటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి తన పరపతి పెంచుకోవటానికే ఈ పర్యటన అని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.